పొదలకూరులో పర్యటించిన బొబ్బేపల్లి సురేష్ నాయుడు
- పొదలకూరులో అస్తవ్యస్తంగా మురుగు కాలువలు
- మురుగు కాలవలని శుభ్రపరచండి.. బ్లీచింగ్ కొట్టించండి.. పందుల నుంచి ప్రజలను కాపాడండి.. జనసేన డిమాండ్
సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు పొదలకూరులో పర్యటించడం జరిగింది. అక్కడ విలేకరులతో మాట్లాడుతూ పొదలకూరు మండలంలో చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ కూడా వ్యాపార లావాదేవీల కోసం వేల సంఖ్యలో వస్తుంటారు అయితే ఇక్కడ మురుగునీరు పోయే ప్రధాన కాలువ ప్లాస్టిక్ కవర్లతో నిండిపోయి, పందులు స్వైర విహారం చేస్తూ ఉంటే ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోకపోవడం శోచనీయం.. వీటివల్ల అంటురోగాలు ప్రబలి ప్రజలు అనారోగ్య లక్కీ గురి అయ్యేటువంటి పరిస్థితి కానీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం చాలా బాధాకరమైన విషయం అదే విధంగా నాయకులు చూస్తే పల్లెటూర్లు పట్టుకొమ్మలు అని ప్రగల్బాలు పలుకుతూ ఉంటారు మరి ఆ పట్టు కొ మ్మలని పటిష్టపరిచే విధానాలను తీసుకువచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా లేవా అనేటువంటిది క్వశ్చన్ మార్క్ గానే మిగిలిపోయింది. అదే విధంగా సర్వేపల్లి నియోజకవర్గం లో అధికార పార్టీ నాయకులు మేము ఏకగ్రీవాలు గా గెలుచుకున్నమ్ అని డప్పు కొట్టుకుంటారు.. మరి ఏకగ్రీవాలైనటువంటి పంచాయతీలకి వచ్చే నిధులు ఎటు పోతున్నాయి.. పల్లెల్లో చూస్తే అభివృద్ధి పనులు గుండు సున్న.. ప్రభుత్వాన్ని ప్రభుత్వం యంత్రాంగాన్ని మేము ఒకటే అడుగుతున్నాం దయచేసి ఈ మురుగు కాలవలని శుభ్రపరచండి.. బ్లీచింగ్ కొట్టించండి. పందుల నుంచి ప్రజలను కాపాడండి.. పందుల స్వైర విహారం వల్ల ఎన్నో అనర్థాలకు అంటురోగాలకు గురి అయ్యే పరిస్థితి దయచేసి ఇకనైనా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని సురేష్ నాయుడు కోరారు.
ఈ కార్యక్రమంలో శ్రీహరి, సంజు రాకేష్, పవన్ కార్తీక్, సతీష్, దినేష్, వంశీ, శశి, బాలు, శ్యామ్యాల్ తదితరులు పాల్గొన్నారు.