తిరుమలకు పాదయాత్ర చేస్తున్న జనసైనికులను అభినందించిన సాయి శరత్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలి.. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బావుండాలని కోరుకుంటూ.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, పుణ్యక్షేత్రం గ్రామం నుండి తిరుమలకు పాదయాత్ర చేస్తున్న జనసైనికులు వేపకాయల సాయి, ముత్యాల శ్యామ్యూల్ లను ఆదివారం దెందులూరు నియోజకవర్గం, పెదపాడు పరిధిలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి డా. వడ్లపట్ల సాయి శరత్ కలుసుకుని వారి సంకల్పం నెరవేరాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి ఆరోగ్య విషయాలు విచారించి వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-14-at-6.13.48-PM.jpeg)