దొడ్డి బెళగల్ గ్రామంలో క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ

మంత్రాలయం నియోజకవర్గం, కోసిగి మండలం, దొడ్డి బెళగల్ గ్రామంలో పొంత నరసింహులు ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు జనసేన కార్యకర్తల కోసం ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టడం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 24 మందికి పార్టీ సభ్యత్వ కిట్లు పంపిణీ చేయడం జరిగింది. పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను సిద్ధాంతాలను ప్రతి ఒక్కరికి తెలియజేయాలని కార్యకర్తలకు, జనసైనికులకు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *