చంపేస్తామంటూ పేర్ని నాని అనుచరుల బెదిరింపులు.. ఎస్ వి బాబు

ఉత్తరాంధ్ర వేదికగా శుక్రవారం జనసేనని పవన్ కళ్యాణ్ యువశక్తి సభలో ప్రసంగించిన అనంతరం. బులుగు చొక్కా వేసుకుని తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ తో బులుగు మీడియా ముందు పేర్ని నాని విషం కక్కటం జరిగింది. పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దూషణలు, అసత్య ఆరోపణలు చేయడం జరిగింది. పేర్ని నాని మాటలకు పెడన నియోజకవర్గం జనసేన నాయకులు ఎస్.వి.బాబు కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఎస్.వి.బాబు కౌంటర్ ఎటాక్ ను తట్టుకోలేక రాత్రి 10 గంటల నుండి అర్ధరాత్రి ఒంటిగంట వరకు పేర్ని నాని అనుచరులు ఆయనకు ఫోన్ చేసి పరుష పదజాలాలతో బండ బూతులు తిట్టడం, నిన్ను చంపేస్తాము అంటూ బెదిరించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్.వి.బాబు మీడియా ముఖంగా మాట్లాడుతూ బందరు అభివృద్ధి గురించి, మచిలీపట్నం పోర్టు గురించి, బందర్ బస్టాండ్ గురించి సూటిగా ప్రశ్నించడం జరిగింది. ఆయన ప్రశ్నలను జీర్ణించుకోలేని పేర్ని నాని తన అనుచరులతో బెదిరిస్తున్నాడు. నాకు ఫోన్ చేసిన నెంబర్లు ట్రూ కాలర్ లో చెక్ చేయగా కొంత మంది ఫోన్ నెంబర్ లు లభించాయి. ట్రూ కాలర్ సమాచారం మేరకు లభించిన ఫోన్ నెంబర్ లపై కృష్ణా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని ఎస్.వి.బాబు అన్నారు. మాజీ మంత్రిగా, ఒక శాసనసభ్యుడుగా సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉంటూ ఇంత నీచానికి వడిగడుతున్న పేర్ని నాని దుర్మార్గపు రాజకీయాలను మచిలీపట్నం ప్రజలు గమనిస్తున్నారు. పేర్ని నాని గారిని నేను ఒకటే అడుగుతున్నా.. మీరు తిడితే పడి ఉండాలనే మీ అహంకారపు ధోరణిని విడనాడాలి. మీ పదవి పోతే మీ వెనకాల పదిమంది తిరగరు. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఏ పదవి లేకపోయినా ఒక పిలుపునిస్తే లక్షలాది మంది వస్తారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే నైతిక హక్కు మీకు లేదు. నువ్వు మీ ముఖ్యమంత్రి కి ఊడిగం చేసుకో, పాలేరుతనం చేసుకో అది నీ ఇష్టం. కానీ పవన్ కళ్యాణ్ గారిపై అసత్య ఆరోపణలు చేసిన, వ్యక్తిగత దూషణలు చేసిన నాలాంటి అనేక మంది జనసైనికులు నీపై తిరగబడతారు. రాబోయే ఎన్నికల్లో నిన్ను చిత్తుచిత్తుగా ఓడించడానికి ప్రతి జనసైనికుడు సిద్ధంగా ఉన్నారని ఎస్ వి బాబు హెచ్చరించారు.