జనసేన కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య అమృతోత్సవ వేడుకలు
•జెండా వందనం సమర్పించిన పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ కార్యాలయంలో భారత స్వాతంత్ర్య అమృతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని రాష్ట్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ గావించారు. ఉదయం త్రివర్ణ పతకాన్ని ఎగురవేసి వందనం సమర్పించారు. అనంతరం జాతీయ గీతాలాపన చేసి జైహింద్ అంటూ నినదించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ , పార్టీ పీఏసీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, వివిధ జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గాల ఇంఛార్జులు, రాష్ట్ర, జిల్లా కార్యవర్గం సభ్యులతోపాటు పెద్ద సంఖ్యలో జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.