అన్యాయం జరిగిందని ప్రశ్నిస్తే.. అక్రమ కేసులు
- గడప గడపకూ ఆగని నిరసన సెగ..
పత్తిపాడు నియోజకవర్గం గుంటూరు రూరల్ మండలం చిన్న పలకలూరు గ్రామంలో బుధవారం వైసీపీ గడప గడప కార్యక్రమంలో ఎమ్మెల్యే సుచిరిత పాల్గొనడం జరిగింది. ఈ గడప గడప కార్యక్రమంలో చిన పలకలూరు గ్రామానికి అన్యాయం జరిగిందని చెప్పి జనసేన పార్టీ నాయకుడు బందలపాటి సాంబశివరావు వారిని ప్రశ్నించడం జరిగింది. వారిని ప్రశ్నించినందుకు సాంబశివరావుని అరెస్టు చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది. వారితో పాటు వారి తల్లిదండ్రులను కూడా స్టేషన్కు తీసుకురావడం జరిగింది. ఈ విషయం తెలుసుకొని జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు నల్లపాడు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఆ విషయం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-17-at-10.14.48-PM-1024x576.jpeg)