జనసేన రక్తదాన కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం

  • రక్తదానం చేయండి ప్రాణ దాతలుకండి
  • జనసేన ఇంచార్జి డా. యుగంధర్ పొన్న

గంగాధర నెల్లూరు, జనసేన పార్టీ గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో 30 వ తేది మంగళవారం ఉదయం 9 గంటల నుండి కార్వేటి నగరం మండల కేంద్రం, ధర్మరాజుల గుడి ప్రాంగణంలో పవన్ కళ్యాణ్ 51 వ పుట్టినరోజు సందర్బంగా జనసేన రక్తదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని నియోజకవర్గం ఇంచార్జి డా.యుగంధర్ పొన్న మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని ఆరు మండలాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, జనసైనికులు, వీర మహిళలకు పిలుపు నిచ్చారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరారు. నువ్విచ్చే రక్తం వేరొకరికి జీవితం, ఒకరిదానం మరొకరి ప్రాణం అవుతుందని తెలిపారు. నువ్వు దానం చేసే రక్తం, జీవన్మరణ సమస్యకు పరిష్కారం చూపుతుందని తెలియజేసారు. చెప్పిరాని ప్రమాదానికి రక్తదానం సమాధానం అవుతుందని, ఆసరా కోల్పోతున్న కుటుంబాలకి రక్తదానాన్ని చేసి అండగా నిలబడదామని ఉద్భోదించారు. రక్తదానం చేయండి, ప్రాణ దాతలుకండని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శోభన్ బాబు, గౌరవ అధ్యక్షులు భాను చంద్ర రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శులు రాఘవ రాఘవ వెంకటేష్, వెంకటేష్, టౌన్ సీనియర్ నాయకులు రూప శేఖర్, చంద్ర ఉపాధ్యక్షులు విజయ్, సురేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోము, సతీష్, కార్యదర్శులు యుగంధర్, జనసైనికులు పాల్గొన్నారు.