వనబరంగి గ్రామంలో జాగరపు పవన్ కుమార్ పర్యటన

అరకు నియోజకవర్గం: పెదబయలు మండలం, కిముడుపల్లి పంచాయితీ వనబరంగి గ్రామంలో గ్రామస్తుల పిలుపుమేరకు జనసేన పార్టీ పెదబయలు మండల అధ్యక్షులు జాగరపు పవన్ కుమార్ పర్యటించటం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులతో జనసేన పార్టీ సిద్ధాంతాలు వివరించటం జరిగింది. రాబోయే ఎన్నికల్లో మన జనసేన పార్టీని స్థాపిద్దాం. మన గిరిజన గ్రామాల్లో అభివృద్ధి చెందాలంటే జనసేన పార్టీని గెలిపించుకుందాం. ఎన్నికల సమయం దగ్గర్లో ఉంది కాబట్టి గ్రామస్తులంతా సిద్ధంగా ఉండాలని తెలియజేశారు. మరియు గ్రామస్తులు గ్రామంలో ఉన్న సమస్య ముఖ్యంగా డ్రైనేజీ మంచినీరు సాగినీరు అనేక రకాల సమస్య ఉన్నాయి అని తెలియచేయడం జరిగింది. అదేవిధంగా గ్రామస్తులు జనసేన పార్టీ సిద్ధాంతలు నచ్చి ఆకర్షితులై జనసేన పార్టీ కండువా కప్పుకొని చేరటం జరిగింది. అలాగే గ్రామంలో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు కూడా జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కార్యక్రమంలో జె కళ్యాణ్, టి రాంబాబు, పి నవీన్ పాల్గొనడం జరిగింది.