రక్తదానమే ప్రాణదానం – పవన్ కళ్యాణ్ సమాజానికి ఆదర్శం: మర్రాపు సురేష్
గజపతినగరం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా 6వ రోజు రక్తదాన శిబిరం జనసేన పార్టీ గజపతినగరం నియోజకవర్గం జనసేన పార్టీ సీనియర్ నాయకులు మర్రాపు సురేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరం ఎన్.వి.ఎన్ బ్లడ్ బ్యాంక్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తేదీన ఉదయం 8 గంటలు నుంచి 1 గంట వరకు ఎన్.వి.ఎన్ బ్లడ్ బ్యాంక్ అధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో గజపతినగరం నియోజకవర్గం నుంచి అన్ని మండలాల నుంచి సుమారు 67 మంది స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సీనియర్ నాయకులు ఆదాడ మోహన్ రావు, మిడతాన రవి కుమార్, గజపతినగరం నియోజకవర్గ నాయకులు పండు, శంకర్, సంతోష్, అభిరామ్, ఆదినారాయణ, హరీష్ శ్రీను రవీంద్ర, నాయుడు, అనిల్ రాంబాబు, సూర్య అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-01-at-14.05.23-1024x770.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-01-at-14.05.23-2-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-01-at-14.05.23-1-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-01-at-14.05.22-1024x770.jpeg)