ఘనంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు
🔸జనసేన పార్టీ ఆధ్వర్యంలో..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా శుక్రవారం ఉదయం జనసేన పార్టీ సీనియర్ నాయకులు సురేష్ మర్రాపు ఆధ్వర్యంలో గజపతినగరంలో మెగా ర్యాలీ, జన సైనికులు సమక్షంలో భారీ కేక్ కట్ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ వ్యవస్థ మార్పుకోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పెట్టారాని, అయన ఆశయాలకు తగ్గట్టుగా భారత దేశంలోనే రైతు భరోసా యాత్ర పేరిట రైతులకు ఆర్ధికంగా ఆదుకుంటున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని పార్టీ బలోపేతంనకు ప్రతీ యొక్క జనసైనికులు, వీరామహిళలు పాటుపడాలని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా రోజుకు ఒక సేవా కార్యక్రమం వారం రోజులు పాటు నిర్వహించడం జరిగింది.
ఆగష్టు 27నుండి సెప్టెంబర్ 2 వరకు నిర్వహించామని, ప్రతీకార్యక్రమం ప్రజలతో మమేకమై, పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధముగా నిర్వహించడం జరిగిందని, భవిష్యత్ లో పార్టీ బలోపేతంనకు మరెన్నో కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సీనియర్ నాయకులు ఆదాడ మోహన్రావు, మిడతాన రవికుమార్, రామకృష్ణ బాలు, గజపతినగరం నియోజకవర్గ నాయకులు పండు, ఆదినారాయణ, శ్రీను, హరీష్, శంకర్, రవీంద్ర, గౌరీ నాయుడు, అనిల్, రాంబాబు, సూర్య పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-02-at-3.03.56-PM-1024x770.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-02-at-3.03.56-PM-1-1024x770.jpeg)