ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు
శుక్రవారం జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు భారీగా కేక్ కట్ చేయడం జరిగింది. తదుపరి జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాయచోటి దీప బ్లడ్ బ్యాంకును నిర్వహించడం జరిగింది. ఇందులో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు, జనసేన వీర మహిళలు అందరూ కలిసి రక్తదానం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కడప లీగల్ సెల్ అధ్యక్షుడు కరుణాకర్ రాజు, ఉపాధ్యక్షుడు కత్తి సుబ్బరాయుడు, వెంకటేశ్వరరావు, వీర మహిళ రజిత, సుండుపల్లి రెడ్డి రాణి, వీరబల్లె గుగ్గిళ్ళ వెంకటేష్, బండ్ల రాజేష్, పోలిశెట్టి శ్రీనివాసులు, బాల సాయి, శంకరయ్య, మన్నూరు గోపి, భాస్కర్ పంతులు, ఐటి కోఆర్డినేటర్ సాయి శ్రీనివాస్, సిద్ధవటం జనసేన నాయకులు అత్తికారి దినేష్, కళ్యాణ్, రాజేష్, కోలాటం హరి, ప్రశాంత్ భారతాల, జనసేన కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, వీర మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.