1400 బైకులతో భారీ బైక్ ర్యాలీ

  • అనకాపల్లిలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

అనకాపల్లి, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ పరుచూరి భాస్కరరావు ఆధ్వర్యంలో నియోజకవర్గం జనసైనికులు 1400 బైకులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిధిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి గడసాల అప్పారావు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో జనసైనికుల సమక్షంలో కేక్ కట్ చేసిన అనంతరం విందులో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కుండ్రం గ్రామానికి చెందిన 50 మంది జనసేన పార్టీలో చేరారు. వారికి భాస్కరరావు, బొలిశెట్టి సత్య, గడసాల అప్పారావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.