తనిఖీలు చేయించి భద్రత చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసిన జనసేన

కాకినాడ రూరల్, కేంద్రీయ విద్యాలయ మరియు గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించిన జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ. కాకినాడ రూరల్ మండలం వలపాకల గ్రామంలో ఉన్నటువంటి కేంద్రియ విద్యాలయలో జరిగిన సంఘటన దురదృష్టకరం. ఉదయం అకస్మాత్తుగా విషవాయువులు వ్యాపించడంతో చిన్న పిల్లలు అశ్వస్థతకు గురయ్యారు గవర్నమెంట్ ఆసుపత్రిలో సరైన వైద్యం అందించి. పిల్లలను వారి తల్లితండ్రులకు క్షేమంగా అప్పజెప్పాలని మరియు ఈ సంఘటన పై అధికారులు సరైన విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని, పరిశ్రమల కాలుష్యం, భద్రతపై పర్యవేక్షించాలని, ఈ సంఘటన మనకి ఒక హెచ్చరికలా తీసుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ ప్రాంతాల్లో అనేక మంది ప్రజలు నివసిస్తున్నారని, జిల్లా కలెక్టర్ వారు సరైన తనిఖీలు చేయించాలని, భద్రత చర్యలు చేపట్టాలని మీడియా ద్వారా కోరారు.