జనసేన వీరమహిళ గ్రంధి అనసూయకు ఘన నివాళులు

నరసాపురం: జనసేన పార్టీ వీరమహిళ శ్రీమతి గ్రంధి అనసూయకు నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో నరసాపురం నియోజకవర్గ ఇంచార్జి, పీఏసీ సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్ ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చినిమిల్లి సత్యనారాయణ, మదంశెట్టి కోటేశ్వరరావు, జక్కం బాబ్జి, కోటిపల్లి వెంకటేశ్వరరావు, వాతాడి కనకరాజు, నిప్పులేటి తారక రామారావు, కోపల్లి శీను, పోలిశెట్టి సాంబ, పులి భుజంగరావు, పోలిశెట్టి నలిని, అంబటి అరుణ, వలవల సావిత్రి, పిప్పల సుప్రజ, కొట్టు దివ్య, గ్రంధి నాని మరియు నియోజకవర్గ నాయకులు జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.