నా సేన కోసం నా వంతులో జనసేనకు అండగా ప్రత్తిపాడు నియోజకవర్గం

  • మేడిశెట్టి సూర్యకిరణ్ లక్ష రూపాయల విరాళం

ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన నాయకులు మేడిశెట్టి సూర్యకిరణ్(బాబి) పిలుపు మేరకు స్పందించి, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు పంపించిన ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన నాయకులు, జనసైనికులు. శంఖవరం మండలం,కత్తిపూడి గ్రామంలో “నా సేన కోసం నా వంతు” కార్యక్రమంలో నియోజకవర్గంలో భారీ స్థాయిలో జనసైనికులు హాజరయ్యారు. రాజకీయాల్లో మార్పు కోసం, భావి తరాల బంగారు భవిష్యత్తు కోసం, నిత్యం ప్రజల పక్షాన నిరంతరం శ్రమిస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి, జనసేన పార్టీ అండగా నిలబడాలని, పార్టీలో భాగస్వాములు అయ్యేందుకు విరాళాలు అందిద్దామని, మరింత బలంగా వ్యవస్థ మార్పు కోసం పోరాడుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రత్తిపాడు నియోజకవర్గ జనసైనికులు అందరూ కలిసి 1,67,346(అక్షరాల లక్షా అరవై ఏడువేల మూడువందల నలబై ఆరు) రూపాయలు జనసేన పార్టీకి విరాళంగా ఫోన్ పే, గూగుల్ పే ద్వారా పంపించడం జరిగింది. అదే విధంగా ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మేడిశెట్టి సూర్యకిరణ్(బాబి) తన వంతుగా 1,00,000(లక్ష) రూపాయలు విరాళం ప్రకటించారు. మెత్తం 2,67,346 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి జనసైనికుడికి, పార్టీకి అండగా నిలబడి విరాళాలు అందించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసారు.