పలు కుటుంబాలను పరామర్శించిన బత్తుల దంపతులు

రాజానగరం, కోరుకొండ మండలం, కాపవరం గ్రామంలో జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, ‘నా సేన కోసం నా వంతు’ కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి దంపతులు పలు కుటుంబాలను పరామర్శించడం జరిగింది.

  • అంగవైకల్యంతో బాధపడుతున్న కొనకాల నాగేశ్వరరావు గారిని పరామర్శించి, జనసేన పార్టీ తరఫున రాబోవు రోజుల్లో అండగా ఉంటామని భరోసా ఇచ్చి, మందుల ఖర్చు నిమిత్తం ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది..
  • గ్రామస్తులు కాళ్ల చిన్న రామయ్య భార్య మరణించగా వారిని పలకరించి, మనోధైర్యం చెప్పడం జరిగింది.
  • లివర్ కంప్లైంట్ తో బాధపడుతున్న దాయల శ్రీనుని పలకరించి, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి వివరాలు తెలుసుకొని జనసేన పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది.
    ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.