పిడుగురాళ్ల జనసేన ఆధ్వర్యంలో నా సేనకోసం నావంతు
పిడుగురాళ్ల, నా సేనకోసం నా వంతు కార్యక్రమంలో భాగంగా.. పీఏసీ మెంబర్ నాగేంద్రబాబు ప్రారంభించిన, జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు సూచన మేరకు జనసేన పార్టీ పిడుగురాళ్ల మండలపార్టీ ఆధ్వర్యంలో.. జానపాడు గ్రామ జనసేన నాయకులు మరియు జన సైనికులు ఏర్పాటు చేసిన క్రౌడ్ ఫండింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జానపాడు గ్రామ జనసైనికులు, గ్రామ పార్టీ సానుభూతిపరులు భారీగా పార్టీ అకౌంట్ కి ఫండింగ్ చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల మండల పార్టీ అధ్యక్షులు కామిశెట్టి రమేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి దూదేకుల కాసిం సైదా, మండల ఉపాధ్యక్షులు బయ్యవరపు రమేష్, మండల ప్రధాన కార్యదర్శి ఆవుల రమేష్, కార్యదర్శి లింగయ్య, పసుపులేటి నరసింహారావు, అంబటి సాయి, పరమేష్, సంగుల రామాంజి, పవన్, ఆదిత్య, మొదలగు వారు పాల్గోన్నారు.