నల్ల మారమ్మ తల్లిని దర్శించుకున్న గురాన అయ్యలు దంపతులు

విజయనగరం: బాబామెట్ట డబుల్ కాలనీలో కొలువైన శ్రీ నల్లమారమ్మ తల్లి పండగ మహోత్సవంలో జనసేన నేత గురాన అయ్యలు దంపతులు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ పెద్దలు ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు వి.నవీన్, ఎమ్. పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.