రామచంద్రపురం జనసేనలో చేరికలు
రామచంద్రపురం నియోజకవర్గం, జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో అయితపూడి గ్రామ పెద్దలు, యువత, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్దాంతాలు నచ్చి జనసేన పార్టీలో చేరడం జరిగింది. రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ మరియు కాజులూరు మండల అధ్యక్షులు బోండా వెంకన్న ఆధ్వర్యంలో 13 వ గ్రామం అయిన అయితపూడి గ్రామంలో పెద్దలను కలసి… ఇంటి ఇంటికి పోలిశెట్టి చంద్రశేఖర్ పర్యటించడం జరిగింది. అయితపూడి గ్రామంలో పెద్దలు ఏకథాటిగా ఒకే మాటమీద ఉండి ప్రస్తుత ప్రభుత్వ పరిపాలన పై ప్రజలు విసుగుచెంది తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు.. వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని, మీ అందరకి ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటానని వారికి భరోసా కల్పిస్తూ జనసేన పార్టీలోకి పోలిశెట్టి చంద్రశేఖర్ కండువాలు కప్పి ఆహ్వానించడం జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్దాంతాలు పోలిశెట్టి చంద్రశేఖర్ అయితపూడి గ్రామ ప్రజలకు తెలియజేయడం జరిగింది.. రామచంద్రపురం నియోజకవర్గం జనసేన నాయకులు జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-25-at-6.56.30-PM.jpeg)