మేడ గురుదత్ ప్రసాద్ ఆధ్వర్యంలో ‘నా సేన కోసం నా వంతు’

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం మల్లంపూడి గ్రామంలో భారీ ఎత్తున ‘నా సేన కోసం నా వంతు’ రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్ అధ్యక్షతన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గంటా స్వరూప దేవి నేతృత్వంలో రాజానగరం మండలం జనసేన పార్టీ కన్వీనర్ బత్తిన వెంకన్న దొర ఆధర్వంలో కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాజానగరం మండల వైస్ ప్రెసిడెంట్ నాగావరుపు భానుశంకర్ రాజానగరం మండల యూత్ ప్రెసిడెంట్ సుంకర బాబ్జి, రాజానగరం మండల కమిటీ కవ్వల శ్రీరామ్, అడబాల హరి, చల్లా ప్రసాద్, మెడిద వీరబాబు, మల్లంపూడి గ్రామ పెద్దలు జనసైనికులు పాల్గొన్నారు.