బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన మేడ

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం పాత వెలుగుబంధ గ్రామానికి చెందిన జనసైనికుడు కొన్నాళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్న నురుకుర్తి స్వాములు అకాల మరణం తర్వాత వారి కుటుంబం కష్టల్లో ఉన్నారు అన్న మాట తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్ వారిని పరామర్శించి జనసేన పార్టీ తరుపున ఇంచార్జ్ 5,000₹ భరోసాగా ఇవ్వడం జరిగింది. మండల జనసేన పార్టీ కన్వీనర్ బత్తిన వెంకన్న దొర వారిని కలిసి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో పాత వెలుగుబంధ జనసేన పార్టీ జనసైనికులు పెద్దిశెట్టి రమేష్, నున్న రాజా, సండ్రు సామీ, మాన్ని మణికంఠ, ప్రగడ సుబ్బు, బత్తుల తేజ, ముసముళ్ల ప్రసాద్, రామ్ ప్రభు, సంగీశెట్టి సీతారామ్, చల్లా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.