అంబటికి పవన్ కళ్యాణ్ ను విమర్శించే అర్హత లేదు: రాటాల రామయ్య
రాజంపేట, సిద్ధవటం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి అడుగుతున్న పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు పవన్ కళ్యాణ్ పై ప్యాకేజీ అంటూ, దత్తపుత్రుడు అంటూ నిరాధారమైన ఆరోపణలతో వ్యక్తిగత దాడులకు దిగడం సిగ్గుచేటని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య అన్నారు. రాజంపేట జనసేన పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు శుక్రవారం సిద్ధవటం మండలంలోని ఉప్పరపల్లె గ్రామంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ పవన్ కళ్యాణ్ ని దూషించడమే వారి విధి విధానం అంటూ అంత వరకే పరిమితమైన మంత్రులుగా వారి బాధ్యతలను పూర్తిగా విస్మరించారని రామయ్య ఎద్దేవ చేశారు. ప్రజలు అప్పగించిన ప్రభుత్వ హోదాల్లో ప్రజాధనంతో విలాసవంతంగా అధికారాన్ని అనుభవిస్తూ, కాలక్షేపం చేస్తున్న మంత్రులకు తన కష్టార్జితాన్ని ప్రజల కోసం వెచ్చిస్తూ, స్వార్ధంగా ప్రజల పక్షాన పోరాడే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని విమర్శించే అర్హత ఎవరికీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన వీరమహిళలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-14-at-16.10.08-1024x768.jpeg)