ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాన్ని పరామర్శించిన నలిశెట్టి శ్రీధర్

ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని అనంతసాగరం మండలం సోమశిల గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాన్ని ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ పరామర్శించారు. ఈ విషయాన్ని పార్టీ హై కమాండ్ దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుంబానికి సాయం చేస్తామని, పేదలకి ఎపుడూ మా మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. నియోజకవర్గ ఉపాధ్యక్షుడు రవి ఉదయగిరి మాట్లాడుతూ నష్టపోయిన కౌలు రైతులకు పవన్ కళ్యాణ్ లక్ష రూపాయలు 3000 మంది రైతులకి ఇస్తున్నారని, ఇటువంటి నాయకుడిని ప్రజలు ఆదరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి వేణు గుడిపాటి, మండల కార్యనిర్వాహక కార్యదర్శి సత్యాల తిరిపాలు నియోజకవర్గ కో ఆర్డినేటర్ అనిల్ రాయల్, నియోజకవర్గ నాయకులు వంశీ తదితరులు పాల్గొన్నారు.