పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మేడ గురుదత్ ప్రసాద్

రాజానగరం, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పర్యటన నిమిత్తం శనివారం సాయంత్రం 3 గంటలకు విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని, పవన్ కళ్యాణ్ పై పెరుగుతున్న అనూహ్య స్పందనకు విఘాతం కలిగించాలని, అధికార పార్టీ వాల్ల కుతంత్రంలో భాగంగా, విశాఖపట్నంలో జరిగే జనసేన కార్యక్రమాలను అడ్డుకుంటామని చెప్పటం, అధికార పార్టీ కుటిల బుద్ధికి ఇది ఒక నిదర్శనం. కావున జనసైనికులు అందరూ సంఘటితమయ్యి, అధ్యక్షునికి అపూర్వ రీతిలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గర స్వాగతించవలసిన అవసరం ఎంతైనా ఉంది. రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ సభ్యులు అందరు స్వచ్ఛందంగా విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ నకు విచ్చేసి అధ్యక్షుల వారికి ఘన స్వాగతం పలుకుతారని కోరుకుంటున్నానని రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్ అన్నారు.