అంబేద్కర్ ని సైతం అవినీతి ఓడించింది: పల్లెపోరులో బొలిశెట్టి

తాడేపల్లిగూడెం, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని సైతం అవినీతి ఓడించిందని రాజకీయాల్లో అవినీతి పేరుకుపోయిందని బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం మండలం మారంపల్లిలో శుక్రవారం జరిగిన పల్లె పోరులో జనసేనపార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాలు అవినీతిమయం అయ్యాయని ప్రజలు అవినీతిని ఎదిరించి తమ ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీపరుడు సీఎం కాగలడని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న అరాచక పాలనను అంతంవందించడానికి మీ ఓటే ఆయుధమని అన్నారు. ఒక రోజులో ఖర్చయ్యే 1000 లేదా 2000 కో అమ్ముడు పోతే ఇలాంటి ప్రభుత్వాలే మన జీవితాలు అతలాకుతలం అవుతాయని అన్నారు. దానికి నిదర్శనమే ఈరోజు వైసీపీ పాలన అన్నారు. మారంపల్లి గ్రామానికి ప్రభుత్వాలు మారిన ప్రధాన రోడ్డు లేకపోవడం దారుణం అన్నారు. వైసిపి పాలనలో నిత్యవసర వస్తువులు అధిక పన్నులు బారంతో ప్రజలు విలవిల్లాడుతున్నారన్నారు. గ్రామ సంక్షేమ నిధులు సైతం పక్కదారి పట్టించడం వైసిపి ప్రభుత్వం ఘణతేనని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచి చేతకాని పాలన చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం మండల అద్యక్షులు అడపా ప్రసాద్, ఆరుగురు సర్పంచ్ పీతల బుచ్చిబాబు, కొత్తూరు ఎంపీటీసీ ఉప్పు నరసింహమూర్తి, బత్తిరెడ్డి రత్తయ్య స్థానిక నాయకులు తోట సూర్యనారాయణ, రామ్ శెట్టి సత్తులు, మంగిన బాలాజీ, కనపర్తి శివగణేష్, శ్రీమంతుల సాయిబాబు, పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, అధికారిక ప్రతినిధి సజ్జాసుబ్బు, జనసేన జిల్లా నాయకులు కసిరెడ్డి మధులత, రామ్ శెట్టి సురేష్, యాంట్రపాటి రాజు, మద్దాల మణికంఠ, కొనకళ్ళ హరినాథ్ గౌరవ అధ్యక్షులు అడబాల నారాయణమూర్తి, జనసేన నాయకులు, మదాసు ఇందు, మారిశెట్టి పోతురాజు, రౌతు సోమరాజు, లింగం శ్రీను, చాపల రమేష్, నీలపాల దినేష్, మట్ట రామకృష్ణ, నల్లకంచు రాంబాబు, పాలూరి బోరయ్య, పాలూరి సందీప్, యువర్న సోము, పెనుబోతుల సోమాలమ్మ, అడపా జమున, దేవ జ్యోతి, సామినేని వెంకట సత్యవతి, వేజ్జు రత్న కుమారి, కందుల జ్యోతి, సత్యవతి, జనసేనసోషల్ మీడియా ఇంచార్జ్ బయనపాలేపు ముఖేష్ మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.