అమరావతి రైతుల మహాపాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపిన రాజానగరం జనసేన
- అకుంఠిత దీక్షతో నిరవధికంగా కొనసాగుతున్న అమరావతి పరిరక్షణ మహోద్యమ మహాపాదయాత్ర.
రాజానగరం, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని మహాపాదయాత్రలో భాగంగా బుధవారం రాజానగరం నియోజకవర్గ గ్రామలైన కొండగుంటూరు, సంపత్ నగరం గ్రామాల మీదుగా ముందుకు సాగింది. మహాపాదయాత్రలో పాల్గొన్న వారికి రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ ఆదేశాల మేరకు కొండగుంటూరు జనసేన నాయకులు అరిగెల రామకృష్ణ మరియు సంపత్, నగరం నాయకులు నల్లా దుర్గాప్రసాద్(పంచాయితీ వైస్ ప్రెసిడెంట్) మరియు జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, గ్రామస్తులు అఖండ స్వాగతం పలికి, బాణసంచా పేల్చుతూ వారికి హారతులు పట్టి, పూలమాలలు వేసి, దుశ్శాలువాలతో సత్కరించిన అనంతరం రైతులకు అల్పాహారం అందించారు. అనంతరం నియోజకవర్గ పొలిమేర వరకు వారితో మహాపాదయాత్రలో పాల్గొని అమరావతి రైతులకు జనసేన పార్టీ తరుపున సంఘీభావం తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-19-at-19.24.44-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-19-at-19.24.20-1024x583.jpeg)