పశ్చిమగోదావరి జిల్లా జనసేన నాయకుల సమావేశం

భీమవరం, జనసేన పార్టీ కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు(చినబాబు) అధ్యక్షతన జరిగిన జిల్లా పిఏసీ సభ్యుల సమావేశం మరియు వివిధ నియోజకవర్గాల ఇంచార్జీలతో జరిగిన సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించడం జరిగింది. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పిఏసి మెంబర్లు కనకరాజు సూరి, బొమ్మిడి నాయకర్, చేగొండి సూర్య ప్రకాష్, రాష్ట్ర కార్యదర్శి ఘంటసాల వెంకటలక్ష్మి, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు, తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇంచార్జి బొలిశెట్టి శ్రీనివాస్, తణుకు ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు, పోలవరం ఇంచార్జ్ చిర్రి బాలరాజు మరియు తదితర నాయకులు పాల్గొన్నారు.