పోలీసుల త్యాగాలు మరువలేనివి

ఆచంట, రాత్రనక పగలనకా విధులు నిర్వహిస్తూ ప్రజల సంరక్షణ కోసం పనిచేసే యోధులు పోలీసులు, సమాజానికి వారు చేసే సేవలను స్మరించుకుంటూ శుక్రవారం పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో దేశ రక్షణలో మా కోసం ప్రాణాలు సైతం లెక్కచేయకుండా అమరులైన పోలీసు మృతవీరులకు జనసేన పార్టీ పెనుమంట్ర మండలం అధ్యక్షులు కోయ వెంకట కార్తిక్ ఘననివాళులు అర్పించారు. అలాగే స్థానిక పెనుమంట్ర మండలం సబ్ ఇన్స్పెక్టర్ సురేంద్ర కుమార్ మరియు పోలీసు స్టాప్ అందరిని కలిసి వారందరికీ స్వీట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి షేక్ ముంతాజ్ బేగం ఆలి, జనసేన నాయకులు బయ్యే బాలాజీ, పొలమూరు జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు తొరం వెంకన్నబాబు, జనసేన నాయకులు తోరం సురేష్, బోనం నరసింహమూర్తి, జవ్వాది సురేష్, గంటా రామకృష్ణ, వేండ్ర కృష్ణకాంత్, తోరం సురేష్ జనసైనికులు పాల్గొన్నారు.