చిర్రి బాలరాజు సమక్షంలో జనసేనలో చేరికలు
పోలవరం నియోజకవర్గం, బుట్టాయగూడెం మండలం వెల్తురివారి గుడెంలో 200 మందికికిపైగా దాదాపు గ్రామం మొత్తం పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి చిర్రి బాలరాజు సమక్షంలో జనసేనపార్టీలో చేరడం జరిగింది. వారికి పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి చిర్రి బాలరాజు జనసేన పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న ప్రభుత్వ విధానాలపై విసుగెత్తామని, కొనబోతే కొరివి అమ్మబోతే అడవి అన్న చందాన ఏమీ కొనలేని స్థితిలో పేదలమైన మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని, ప్రత్యామ్నాయం జనసేనపార్టీ మాత్రమేనని గ్రామ పెద్దలు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా పార్టీలో చేరిన వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని, అందరూ పార్టీ బలోపేతానికి కృషి చేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ముఖ్య మంత్రిని చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి రాము, కొప్పుల శ్రీకాంత్, బండారు అనీల్, వీరంకి వెంకటేశ్వరరావు, సరియం ముత్యాలరావు, జనసేన నాయకులు, మరియు జనసైనికులు పాల్గొన్నారు.