టెక్కలి జనసేన కార్యాలయంపై వైసీపీ గుండాల దాడిని ఖండించిన ఎస్ వి బాబు

శ్రీకాకుళం జిల్లా, టెక్కలి నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం పై వైసీపీ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. జనసేన పార్టీ కార్యాలయం పై దాడి హేయమైన చర్య. ప్రజాస్వామ్యవాదులు ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండించాలి. ప్రజా క్షేత్రంలో జనసేన పార్టీని ఎదుర్కొనే దమ్ము లేక పిరికిపందల్లాగా జనసేన నాయకులు ఇంటిపై, జనసేన పార్టీ కార్యాలయంపై దాడి చేస్తున్న వైసిపి గుండాలకు సరైన సమయంలో బుద్ధి చెబుతాం. దువ్వాడ శ్రీనివాస్ అనే అరాచకశక్తి అనుచరులే ఈ దాడికి ఎగబడినట్లు సమాచారం. దువ్వాడ శ్రీనివాస్ ది నేర చరిత్ర అతనిపై 18 కేసులు ఉన్నాయి. అయినా గాని జగన్ రెడ్డి అతనికి ఎమ్మెల్సీ ఇచ్చి ప్రతిపక్షాలపై దాడి చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. వైసీపీ అదిరింపులకు, బెదిరింపులకు జనసైనికులు ఎవరు భయపడరు. వైసిపి పార్టీ చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో వైసిపి నాయకులకు ప్రజలు తప్పుగా బుద్ధి చెబుతారని పెడన జనసేన నాయకులు ఎస్ వి బాబు అన్నారు.