జనంకోసం జనసేన 327వ రోజు

  • వనరక్షణలో భాగంగా 700 మొక్కల పంపిణీ

జగ్గంపేట, జనంకోసం జనసేన 327వ రోజులో భాగంగా జనసేన వనరక్షణ మొక్కల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ఆధ్వర్యంలో గోకవరం మండలం, గోకవరం గ్రామంలో జరిగింది. కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 700 మొక్కలు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 84695 మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి దోసపాటి సుబ్బారావు, గోకవరం మండల అధ్యక్షులు ఉంగరాల మణిరత్నం, గోకవరం మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు చల్లా రాజ్యలక్ష్మి, గోకవరం మండల మీడియా సెల్ అధ్యక్షులు మహిపాల పాండురాజు, జగ్గంపేట నియోజకవర్గం మాల మహానాడు అధ్యక్షులు నక్క రామరాజు, గోకవరం మండల ప్రధాన కార్యదర్శి కొమరపు శివ, గండేపల్లి మండల సంయుక్త కార్యదర్శి కారుకొండ విజయ్ కుమార్, గోకవరం పట్టణ అధ్యక్షులు పదిలం మురళి, గవిని దుర్గాప్రసాద్, ఉంగరాల శివాజీ, గాజింగం రాజా, ఏనుగు సూర్యప్రకాష్, అమర్తి సాయికృష్ణ, రొంగల గణేష్, తోట దీపక్, సీర్ల దుర్గాప్రసాద్, మద్దాల రాంబాబు గారికి, జె.కొత్తూరు గ్రామ అధ్యక్షులు గుంటముక్కల మధు, కొత్తపల్లి నుండి పువ్వల శ్రీదేవి, పువ్వల నిహారిక దేవి, కృష్ణునిపాలెం నుండి కరిబండి సాయి పవన్, గోనేడ నుండి వల్లభశెట్టి నాని గారికి, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ లకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా గోకవరం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన మొగలి మురళి కుటుంబ సభ్యులకు, గవిని దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.