రాజానగరం జనసైనికుల ఆధ్వర్యంలో శ్రమదానం

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, పశ్చిమ గానుగుడెం గ్రామంలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని జనసైనికుల ఆధ్వర్యంలో శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ అధ్యక్షతన గుంతలు పూడ్చడం జరిగింది. అలానే తక్షణమే రోడ్లు మరమ్మత్తు కార్యక్రమం చేపట్టాలని ఇంచార్జి మీడియా వేదికగా డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోరుకొండ మండల జనసేన పార్టీ కన్వీనర్ మండపాక శ్రీను, కోరుకొండ మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి వీరపురాజు పోసిబాబు, చదువు నాగు, కోరుకొండ మండల కమిటీ మెంబెర్ కోలా జాన్ ప్రసాద్, కాపవరం గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు ఆకుల ఆదిత్య, జాజుల శివరామకృష్ణ, తొరటి దుర్గాప్రసాద్, కోరుకొండ గ్రామ జనసేన పార్టీ యూత్ అధ్యక్షులు రాయపాటి హరీష్, తెలగంశెట్టి శివ, తన్నీరు తాతాజీ, కోరుకొండ సీనియర్ నాయకులు చదువు ముక్తేశ్వరరావు, కాపవరం ఎంపీటీసీ అభ్యర్థి ముల్లంగి బాపిరాజు, జనసేన పార్టీ కోరుకొండ సోషల్ మీడియా పెమ్మాడ సతీష్ కుమార్, కొచ్చర్ల బాబి, కొచ్చర్ల భరత్, రాయపాటి వెంకటేష్, గానుగుడెం గ్రామ నాయకులు గొల్ల సాయి, చోంగ పవన్ కుమార్, బత్తిన రాజబాబు, జనసేన పార్టీ గ్రామ సెక్రెటరీ బొజంకి రాజు గ్రామస్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.