వైసిపి దౌర్జన్యాలు నిరసిస్తూ ర్యాలీ

ప్రకాశం జిల్లా, కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ మండల అధ్యక్షుడు ఇనాబత్తిన రాజేష్ అధ్వర్యంలో వైసీపీ సర్పంచ్ తాడిపత్రి వనజ ప్రజా సొమ్ముని కాజేసినందుకు జనసేన మండల అధ్యక్షులు రాజేష్, జనసైనికులు, వీరమహిళలు ప్రశ్నించినందుకు వైసీపీ గుండాలతో అధ్యక్షులు రాజేష్ కి ఫోన్ చేసి బెదిరించినందుకు గురువారం అధ్యక్షులు రాజేష్, జనసైనికులు, వీరమహిళల అధ్వర్యంలో వైసిపి దౌర్జన్యాలు నిరసిస్తూ ర్యాలీ చేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, ఎస్సై ఫాతిమా వైసీపీ గూండాలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రౌండ్ లెవెల్ ప్రోగ్రామర్ కేశవరావు, మండలాల అధ్యక్షులు మనోజ్, శశి, విశ్వ, రాంబాబు, చంద్రశేఖర్ జనసైనికులు కాసుల శ్రీను, చాంద్ భాష, సుభాని కిరణ్, నాగరాజు, జగదీష్, రాజు, సాయి, వీర మహిళలు పాల్గొన్నారు.