పశ్చిమ నియోజకవర్గంలో జనసేన కార్యాలయ ప్రారంభం

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, జనసేన పార్టీ ఆఫీస్ మరియు న్యాయవాది ఆఫీస్ గురువారం ఓపెన్ చేయడం జరిగింది. విలేకరులతో మాట్లాడుతూ జనసేన రాష్ట్ర బీసీ నాయకుడు జనసేన పార్టీ బలంగా ముందుకు పోయి 2024 ఎలక్షన్లో మెజారిటీతో అధికారంలోకి వస్తుంది దౌర్జన్యాలు రౌడీయిజం చేసే వైఎస్ఆర్సిపి తగిన మొగుడు పవన్ కళ్యాణ్ అని తెలిపారు. నామినేషన్ వేసిన అందుకే రౌడీయిజంగా జనసేన పార్టీ నాయకుని హత్య చేశారు. ఇలాంటి పాలన భారతదేశంలో మొట్టమొదటిసారిగా చూస్తున్నాం. ఇలాంటి తుగ్లక్ పరిపాలన ఏ రాష్ట్రంలో ఉండదు మంచి అవినీతి లేని పరిపాలన 2024 జనసేన పార్టీ అందిస్తుందని తెలియజేశారు. జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. జనసేన పార్టీ తరఫున ఆడపిల్లలకి పశ్చిమ నియోజకవర్గంలో ఉచితంగా సెల్ఫ్ డిఫెన్స్ ఆత్మ రక్షణ క్లాసులు మరియు మరింత సోషల్ సర్వీస్ అండ్ సోషల్ మీడియా తరఫున ముందుగా పోతామని జనసేన రాష్ట్ర బీసీ నాయకులు మరియు న్యాయవాది ఏం హనుమాన్, జనసేన నాయకులు కే జగదీష్ ప్రసాద్ తెలియజేశారు.