కూకట్పల్లి జనసేన ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

కూకట్పల్లి, రమ్య గ్రౌండ్ లో కూకట్పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమములో ముఖ్య అతిథిగా కూకట్పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ హాజరవడ, జరిగింది. ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ మహిళలు ఉదయం పూట ఇళ్ళ ముందు ముగ్గులు వేయడం మంచి వ్యాయామమ‌న్నారు. దీంతోపాటు మహిళల్లో సృజనాత్మకత పెరుగుతుందన్నారు. ముగ్గుల పోటీలు ఐక్యతకు, ఆప్యాయతకు నిదర్శనమ‌న్నారు. సంక్రాంతి పండుగ ప్రకృతి పండుగ అని తెలిపారు. సాంస్కృతిక అంశాలు మానసిక వికాసానికి, శారీరక ఆరోగ్యానికి, ఏకాగ్రతకు ఎంతగానో దోహదపడుతాయని తెలియజేశారు. ముగ్గుల పోటీల్లో గెలుగుపొందిన వారికి ప్రథమ, ద్యితియ, తృతీయ బహుమతులు అందజేశారు. అలాగే పాల్గొన్న అంద‌రికీ కూడా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి వీర మహిళలు ముంతాజ్, ఎర్ర సత్యా, పుష్పలత, సరోజినీ దేవి, జనసేన నాయకులు మండలి దయాకర్, కొల్లా శంకర్, కిషోర్ నాగరాజు, అంజి, సత్యసాయి, సుబ్బు, షణ్ముఖ, శ్రీనివాస్ గోవిందా, కమలాకర్, వెంకట్, మోటేపల్లి శివ తదితరులు పాల్గొన్నారు.