అనకాపల్లి జనసేన ఆధ్వరంలో జగనన్న మోసం

అనకాపల్లి, జగనన్న ఇళ్ళు పధకం అమలులో జరుగుతున్న అవకతవకలని పరిశీలించేందుకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు శనివారం జనసేన అనకాపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ పరుచూరి భాస్కరరావు ఆధ్వర్యంలో సత్యనారాయణపురం మెగా లేఔట్ లో ఉన్న టిడ్కో గృహాలు, వేటజంగాలపాలెం మరియు కూండ్రం గ్రామాల్లో ఉన్న జగనన్న ఇళ్ల పట్టాల లేఔట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ, సంకు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. రోజు రోజుకి పాడైపోతున్న టిడ్కో గృహల సముదాయం నుండి #Jaganannamosam అనే హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో వీడియో మరియు ఫోటోలు పోస్టు చేశారు. మూడు రోజుల కార్యక్రమం అనంతరం పూర్తి నివేదికను పార్టీ అధ్యక్షులకి పంపనున్నట్లు భాస్కరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి మండలం జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.