పాయకరావుపేట జనసేన ఆద్వర్యంలో జగనన్న ఇళ్లు పేదలందరికీ కన్నీళ్లు

పాయకరావుపేట నియోజకవర్గం: జగనన్న ఇల్లు పేదల కన్నీళ్లు కార్యక్రమంలో బాగంగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ గడ్డం బుజ్జి ఆదేశాల మేరకు కోటవుట్ల మండలం కోటవురట్ల గ్రామంలో పేదలకు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లను ఆదివారం జనసైనికులు అందరూ వెళ్లి పరిసీలించడం జరిగింది. ఇందులో భాగంగా అక్కడ లింగాపురం నుంచి వస్తున్న తుపాకీ గడ్డ నుంచి వస్తున్న నీళ్లు మొత్తం ఆ యొక్క పేదలకు ఇచ్చిన గృహాల వైపు వచ్చేస్తున్నాయి. కనీసం ఆ యొక్క గడ్డం నుంచి వచ్చిన నీరు బయటకు పంపించకుండా, అడ్డుకట్ట వేయకుండా బాధ్యత లేకుండా ఈ ప్రభుత్వం చేస్తుందని ఇల్లు నిర్మించుకోవడానికి అక్కడ పేదలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం కరెంటు కూడా లేదు అక్కడ సిమెంట్ బస్తాలు దాచుకోవడానికి కనీసం షెడ్ కూడా లేదు అక్కడ ఈ విషయం మీద జనసైనికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బద్రి ప్రచార కార్యదర్శి పవన్ మరియు లింగాపురం దుర్గా జన సైనికుడు బోడపాటి రవికుమార్ పాల్గొన్నారు.