ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జనసేనతోనే సాధ్యం.. జనసేన పల్లెపోరులో బొలిశెట్టి శ్రీనివాస్

తాడేపల్లిగూడెం: వైసీపీ అధికారాన్ని గద్దె దించే రోజు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురుచూస్తున్నారని బొలిశెట్టి అన్నారు. తాడేపల్లిగూడెం మండలం మోదుగుంట గ్రామంలో బుధవారం జరిగిన పల్లె పోరు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి అరాచక పాలన జరుగుతుందని గ్రామంలో రోడ్ల పరిస్థితి చూస్తే మనిషి నడవడానికి కూడా లేకుండా చాలా అధ్వానంగా ఉన్నాయన్నారు, మోదుగుంట గ్రామంలో స్థానికులే బిల్డింగ్ కొట్టేసిన రద్దును వేసుకొని నడక సాగిస్తున్నారు అని శ్రీనివాస్ అన్నారు. ఇటేవల జనసేన తలపెట్టిన కార్యక్రమం #JaganannaMosam అనే కార్యక్రమంలో జగనన్న మోసం గురించి ప్రజలకు వివరిస్తూ జగనన్న కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు కరువయ్యాయన్నారు. రోడ్లు, డ్రైనేజీ, నీరు, కరెంట్ సదుపాయాలు ఎక్కడా కానరావడంలేదన్నారు. లబ్ధిదారులు అప్పులు తెచ్చుకొని బేస్మెంట్ వేసుకున్నారని, కానీ ఇక్కడకు కనీసం ఇసుక, కంకర, ఐరన్ తెచ్చుకుని ఇల్లు నిర్మించుకునే అవకాశం లేకపోవడం వలన తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోయి ఇల్లు నిర్మించుకోలేక అవస్థలు పడుతున్నారన్నారు. ఇంటి నిర్మాణానికి సరైన సహకారం ప్రభుత్వం నుండి లేదన్నారు. ఇప్పటికైనా జగనన్న ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం రూరల్ మండల అధ్యక్షులు అడపా ప్రసాద్, మోదుగుంట గ్రామ నాయకులు సిద్ధ వీరరాజు, కట్ట ముత్యాలు, గరగ మాణిక్యం, చిటికిన హనుమంతు, వల్లేపల్లి వెంకటసత్యనారయణ, చిటికినతిరుపతిరావు, చిటికిన రాములు, చినబోయిన కృష్ణ, చినబోయిన కాటమ రాయుడు, చినబోయిన నాగరాజు,శామన శ్రీను, తానింకి సత్యనారయణ, కోయిల సుబ్బు, వీరమలను శ్రీనివాస్, అయ్యనప్రతి ప్రభాకర్, మల్లిపూడి రాజారావు మరియు తాడేపల్లిగూడెం జనసేన నాయకులు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.