వనమా సాయికి (జె.ఎస్.పి) సైనిక సాయం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ములకలపల్లి మండలం లో పొగలపల్లి పంచాయతీ పరిధిలోని రాజపేట కాలనీకి చెందిన వనమా సాయి అనారోగ్యం కారణంగా ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న ములకలపల్లి జనసేన పార్టీ నాయకులు మండలంలో ఉన్నటువంటి జన సైనికుల సహకారంతో (జె.ఎస్.పి)సైనిక సాయం నిధిని ఏర్పాటు చేసి 10000/- లు ఖర్చుల నిమిత్తం వనమా సాయికి ములకలపల్లి జనసేన పార్టీ అధ్యక్షుడు తాటికొండ ప్రవీణ్ ఆధ్వర్యంలో ఆర్థిక సహకారం అందించడం జరిగింది. ఈ సందర్భంగా తాటికొండ ప్రవీణ్ మాట్లాడుతూ జె.ఎస్.పి సైనిక సాయం ముఖ్య ఉద్దేశం మండలంలో ప్రతీ పంచాయితీలో ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాలను గుర్తించి జె.ఎస్.పి సైనిక నిధి నుంచి సాయం అందివ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగం జిల్లా సెక్రెటరీ గరిక రాంబాబు ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థి విభాగం కార్య నిర్వహ సభ్యులు గొల్ల వీరభద్రం మండల అధ్యక్షులు తాటికొండ ప్రవీణ్ సహాయ కార్యదర్శి బొక్క వెంకటేశ్వర్లు, డాక్టర్ ఎస్కే రఫీ పాషా, పోగలపల్లి డాక్టర్ రాము జనసేన కార్యకర్తలు నక్కన రమేష్, చిట్టిబాబు, నితీష్ తదితరులు పాల్గొన్నారు.