తగ్గేదేలే అంటున్న టీమ్ పిడికిలి

కాకినాడ రూరల్, జనసేన పార్టీ అభిమాన సోషల్ మీడియా విభాగం టీం పిడికిలి నుంచి విడుదలైన ఆటో స్టిక్కర్స్ ని వేరువేరు ప్రదేశాల్లో ఆవిష్కరించిన పిఏసి సభ్యులు కాకినాడ రూరల్ ఇన్చార్జి పంతం నానాజీ, కాకినాడ జనసేన పార్టీ సిటీ ప్రెసిడెంట్ సంగిశెట్టి అశోక్ లు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా టీం పిడికిలి విభాగపు మోటివేటర్ గంజి గోవిందరాజు, కాకినాడ రూరల్ జనసేన పార్టీ మండలం ప్రెసిడెంట్ కరెడ్ల గోవిందరాజు, కాకినాడ సిటీ మత్స్యకార నాయకుడు దాసరి వీరబాబు, నూకల నారాయణరావు, అడపా శివరామకృష్ణ, రామిశెట్టి సూరిబాబు, తమ్మనబోయిన సుదర్శన్ తదితర జనసేన నాయకులు జనసైనికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీం జిల్లా మోటివేటర్ గంజి గోవిందరాజు మాట్లాడుతూ జనసైనికుల ఐడియాలజీ సోషల్ మీడియాకి మాత్రమే పరిమితం కాకుండా జనాల్లోకి జనసేన యాక్టివిటీస్ తెలిసే విధంగా ఉండేందుకు తాము ఈ కార్యక్రమం స్టేట్ వైడ్ గా 175 నియోజకవర్గాలలో మైలవరపు రాజా నేతృత్వంలో నిర్వహిస్తున్నామని తెలియజేశారు.