18, 19 తేదీల్లో ఉమ్మడి కడప జిల్లాలో నాదెండ్ల మనోహర్ పర్యటన

ఉమ్మడి కడప జిల్లా పర్యటనలో భాగంగా జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ 18, 19వ తేదీల్లో రైల్వేకోడూరు, రాజంపేట నియోజక వర్గాల్లో పర్యటించనున్నారు. 18వ తేదీన తిరుపతి విమానాశ్రయం నుంచి రైల్వే కోడూరు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. 19వ తేదీన రాజంపేట పర్యటనలో భాగంగా గతేడాది అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడంతో నష్ట పోయిన ముంపు ప్రాంతాల ప్రజలు ఇప్పటికీ ఇక్కట్లలో ఉన్న పరిస్థితిని మనోహర్ పరిశీలించనున్నారు. ప్రాజెక్టు తెగిపోయి సంవత్సరం గడిచిన సందర్భంగా ప్రభుత్వం నుంచి ఏ మేరకు సాయం అందిందో బాధితులతో మాట్లాడి స్వయంగా తెలుసుకోనున్నారు. క్షేత్రస్థాయిలో జరిగిన నష్టం, ఇప్పటికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వకపోవడం, పొలాల్లో ఇసుక మేటలు తీయకపోవడాన్ని పరిశీలిస్తారు.