రోడ్ల దుస్థితిపై గళమెత్తిన వెంకటగిరి జనసేన

వెంకటగిరి నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో సైదాపురం నుంచి డేగలపూడికి వెళ్లే మార్గం మొత్తం గుంతల మయమై నిత్యం ప్రమాదాలు జరుగుతూ స్థానికులు ఇబ్బందికరంగా ఉంది అంటూ ఎన్నిసార్లు నిరసనలు తెలిపినా సీఎం నిద్ర లేవడం లేదంటూ గుడ్ మార్నింగ్ సీఎం.. కొత్త రోడ్లు వేయాలని నిరసిస్తూ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకటేశ్వర్లు, సైదాపురం మండల ప్రెసిడెంట్ శివ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొని అనంతరం ఎమ్మార్వోకి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు గునుకుల కిషోర్, కాపు సంక్షేమ సేన నెల్లూరు జిల్లా అధ్యక్షులు పూసల లక్ష్మీ మల్లేశ్వరరావు మరియు జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.