మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన ముఖరంచాన్
అన్నమయ్య జిల్లా, హెడ్ కోర్టర్స్ రాయచోటి నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు అసెంబ్లీ ఇంచార్జ్ హసన్ భాష ఆధ్వర్యంలో భారతదేశ 75వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలకు హాజరైన రాష్ట్రకార్యదర్శి ముఖరంచాన్ జెండావందన కార్యక్రమాన్ని చేసారు.. భారతదేశ సర్వసత్తాకా దేశంగా గుర్తించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో దేశం కోసం అసువులు బాసిన ప్రతి అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు రామాశ్రీనివాస్, రియాజ్, గేట్ బాబ్జి మరియు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు హాజరై తమ దేశభక్తి తో దేశ సమగ్రతను కొనియాడారు.