మేక ఈశ్వరయ్య ఆధ్వర్యంలో జనసైనికుల కార్తీక మాస ఆత్మీయ సమ్మేళనం
చింతలపూడి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మేక ఈశ్వరయ్య ఆధ్వర్యంలో శుక్రవారం జనసైనికుల కార్తీక మాస ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అద్యక్షులు కొటికలపూడి గోవిందరావు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఘంటసాల వెంకటలక్ష్మి, తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు తదితర జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-18-at-14.16.23-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-18-at-14.16.22-1024x576.jpeg)