గిరిసేన జనసేన- జనం వద్దకు- జనసేన 35వ రోజు

పాలకొండ: శుక్రవారం జనసేన- గిరిసేన జనం వద్దకు-జనసేన 35వ రోజు కార్యక్రమంలో భాగంగా పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ జనసేన జానీ మాట్లాడుతూ.. వైస్సార్సీపీ పార్టీ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాన్ని క్షేత్రస్థాయిలో ఎండగట్టేందుకు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు అందులో 35వ రోజు వీరఘట్టం మండల కేంద్ర పరిధిలో విస్తృతంగా పర్యటించి ప్రతి సమస్య తెలుసుకుని, ప్రజల పక్షాన నిలబడి అవి పరిష్కారం అయ్యేవరకు ప్రభుత్వం పై జనసేన పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. మత్స పుండరరీకం మాట్లాడుతూ.. టీమ్ పిడికిలి పోస్టర్స్ నీ గ్రామంలోకి ప్రచార నిమిత్తం ఇన్నాళ్లు పవన్ కళ్యాణ్ గారిని, జనసైనికులు జనసేన నాయుకులులను, వీరమహిళలను ఎన్నో విధాలుగా అనరాని మాతలు మాట్లాడి ఇబ్బందులు పెట్టినా ఇంతవరకు తగ్గాం ఇకనుంచి ఎవ్వరైనా పవన్ కళ్యాణ్ గురించి గాని, జనసేన పార్టీ గురించి గాని అధికార పక్ష నేతలు మీడియా ముందు అనవసరంగా మాట్లాడితే వారికి సమాధానం చెప్పేఒదుకు గ్రామ గ్రామాన జనసైనికులు సిద్దగా ఉండాలని కోరారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు జనసేన పార్టీ దగ్గర తగ్గాలిసిందే అనే పోస్టర్స్ ప్రచారం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో మత్స. కృష్ణరావు, వాన కైలాష్, వావిలపల్లి రాంబాబు, భార్గవ్, పి.చరణ్, మత్స. భరత్ నాయుడు, చింత గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.