కౌలురైతు భరోసా యాత్రకి పది లక్షల విరాళం అందించిన చందు

  • జనసేనానిని మర్యాదపూర్వకంగా కలిసిన బొలిశెట్టి శ్రీనివాస్

హైదరాబాద్, జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ మరియు తాడేపల్లిగూడెం నియోజకవర్గం అరుగొలను గ్రామ ఐకాన్ నాని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అరుగొలను గ్రామ జనసేన పార్టీ గెలుపుకు, ఉనికి చాటుకోవటంలో నాని కృషి ఎంతో ఉంది. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిస్థితులపై అధినేతతో చర్చించడం జరిగింది. అనంతరం జనసేన కౌలు రైతు భరోసా యాత్రకికి తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ స్నేహితులు ఆస్ట్రేలియాకి చెందిన చందు పది లక్షల రూపాయలు చెక్కును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అందజేయడం జరిగింది.