పలు బాధిత కుటుంబాలను పరామర్శించిన బత్తుల వెంకటలక్ష్మి
రాజానగరం: సీతానగరం మండలం, కూనవరం గ్రామంలో.. రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు, నా సేన కోసం నా వంతు కమిటీ కో ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పలు బాధిత కుటుంబాలను పరామర్శించిన వివరాలు.. నూజెళ్ల రామకృష్ణ కు కాలు చెయ్యి సరిగ్గా సహకరించక ఇబ్బంది పడుతున్న వారిని పలకరించి ధైర్యం చెప్పి వైద్య ఖర్చుల నిమిత్తం 5,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది.. తంబాబత్తులు నారాయణ 8 నెలల పసిబాబు చనిపోవడంతో వారిని పలకరించి, మనోధైర్యం చెప్పడం జరిగింది.. రావూరు వెంకటరావు ఇటీవల స్వర్గస్తులు కాగా… శనివారం పెద్దకార్యంలో వారికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో కూనవరం గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు మాధవరపు వీరభద్రరావు గారు, అడపా నరసింహం, మాధవరపు వెంకన్న, మాధవరపు వెంకటేశ్వరరావు, నూజెల్లా మురళి, అలమండ కోటియ్య, అడపా రాజు, ఉమ్మడిశెట్టి సురేష్, మద్దిరెడ్డి బాబులు, తోట అనిల్ వాసు.. కూనవరం జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-19-at-7.44.21-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-19-at-7.44.23-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-19-at-7.44.24-PM.jpeg)