కన్నేవలస పంచాయతీలో జనంతో జనసేన 3వ రోజు

టెక్కలి నియోజకవర్గం: జనసేన పార్టీ నాయకులు సుధీర్ మేడిబోయిన, కోటేష్ పల్లి అధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, జనసేన పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకువెళ్తూ జనసేన పార్టీ బలోపేతానికి జనంతో జనసేన అనే కార్యక్రమాన్ని మూడవ రోజు చేపట్టడం జరిగింది.. ఈ కార్యక్రమంలో బాగంగా టెక్కలి నియోజకవర్గం, కోటబొమ్మాళి మండలం, కన్నేవలస పంచాయతీలో ప్రతి గడపకి వెళ్తు, పార్టీ సిద్ధాంతాలు, మేనిఫెస్టో వివరిస్తూ… ఈసారి ఎన్నికల్లో జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ పై ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారికి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరడం జరిగింది. జనంతో జనసేన కార్యక్రమంలో టెక్కలి నియోజకవర్గ నాయకులు చందు, రమేష్, ఉదయ్ పట్నాయక్, శ్రీను పట్నాయక్, ప్రసాద్ లింగబేరి, లండ పవన్ కుమార్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.