కూకట్‌పల్లి కాపు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాసేన కోసం నావంతు

కూకట్‌పల్లి కాపు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కాపు వనభోజనం మహోత్సవ కార్యక్రమంలో భాగముగా నా సేన కోసం నా వంతు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యకమంలో జనసైనికులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. వందకు పైగా జనసైనికులు నాసేన కోసం నావంతులో భాగంగా లక్షకు పైగా విరాళాలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వర్ధినేని దుర్గ శ్రీనివాస్, మెండా వెంకట్రావు, తుమ్మల మోహన్, కొల్ల శంకర్, దయాకర్, సాయి, తదితరులు నిర్వహించారు.