జనసేన పార్టీని బలోపేతం చేయడానికి చర్చలు

ఆచంట: శుక్రవారం పిఎసి సభ్యులు పితాని బాలకృష్ణ, స్టేట్ కార్యదర్శి బోణం చిన్న బాబు, ఆచంట నియోజకవర్గం మండల ప్రెసిడెంట్ బాలాజీ, పోడూరు మండల ప్రెసిడెంట్ పితాని వెంకటేష్, పోడూరు ఎంపీటీసీ మానేపల్లి శ్రీధర్, రీజినల్ కోఆర్డినేటర్స్ మహిళా విభాగం కాట్నం విశాలి, కడలి ఈశ్వరి మరియు జనసేన పార్టీ ముఖ్య నాయకులు, జనసేన పార్టీ పిఎసి సభ్యులు చేగొండి సూర్య ప్రకాష్ ని మర్యాదపూర్వకంగా కలిసి పార్టీ బలోపేతం చేయడానికి చర్చించుకోవడం జరిగింది. ఈ సందర్భంలో వచ్చిన ముఖ్య నాయకుల అందరికీ చేగొండి సూర్య ప్రకాష్, బోనం చిన్న బాబు చేతుల మీదగా వారిని శాలువా కప్పి సత్కరించారు.